ఎన్పీఎస్, పీపీఎఫ్, సుకన్య అకౌంట్లలో కనీసం ఎంత డిపాజిట్ చేయాలి? చేయకపోతే ఏమైతది?
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్: సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ను యాక్టివ్గా ఉంచుకునేందుకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250ను ఈ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే.. దీన్ని డిఫాల్ట్ అకౌంట్గా పరిగణిస్తారు. ఎస్ఎస్వై అకౌంట్ తెరిచిన నాటి నుంచి 15 ఏళ్లు పూర్తయ్యే లోపే డిఫాల్ట్ అకౌంట్ను పునరుద్ధరించుకోవాలి. ఈ అకౌంట్ యాక్టివేట్ కోసం ప్రతేడాది రూ.50 పెనాల్టీతో పాటు రూ.250 మినిమమ్ కంట్రిబ్యూషన్ను చెల్లించాలి.
ఎన్పీఎస్ అకౌంట్ల కనీస మొత్తం: టైర్ 1 ఎన్పీఎస్ అకౌంట్ హోల్డర్లు తమ అకౌంట్లను యాక్టివ్లో ఉంచుకోవాలంటే తప్పనిసరిగా కనీసం రూ.1000 చెల్లించాలి. ఒకవేళ ఈ కనీస మొత్తం చెల్లించలేకపోతే.. అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది. డోర్మాట్ ఎన్పీఎస్ అకౌంట్ను రీయాక్టివేట్ చేసుకునేందుకు కనీస కంట్రిబ్యూషన్తో పాటు ప్రతి ఏడాది రూ.100 పెనాల్టీ చెల్లించాలి. ఎన్పీఎస్ అకౌంట్ అన్ఫ్రీజ్ చేసుకునేందుకు పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఛార్జీలు వర్తిస్తాయి
పీపీఎఫ్ కనీస మొత్తమెంతా? పీపీఎఫ్ అకౌంట్లో కనీసం వార్షికంగా కంట్రిబ్యూట్ చేయాల్సిన మొత్తం రూ.500. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంట్రిబ్యూషన్కు తుది గడువు మార్చి 31, 2022 వరకు ఉంది. ఒకవేళ మార్చి 31 లోపల డిపాజిట్ చేయలేకపోతే.. ప్రతి ఏడాది మీరు రూ.50 పెనాల్టీ కట్టాలి. రూ.500 మినిమమ్ డిపాజిట్ చేసే సమయంలో మళ్లీ అదనంగా రూ.50 ప్రతి ఏడాదికి కట్టాల్సి ఉంటుంది. లేదంటే మీ పీపీఎఫ్ అకౌంట్ క్లోజవుతుంది. క్లోజ్ అయిన పీపీఎఫ్ అకౌంట్ నుంచి లోన్ తీసుకోలేరు. అంతేకాక మనీని విత్ డ్రా చేసుకోలేరు. మెచ్యూరిటీ తేదీకి ముందే మీ అకౌంట్ను పునరుద్ధరించుకోవాలి. మెచ్యూరిటీ తర్వాత యాక్టివేట్ చేసుకోలేరు. క్లోజ్ కూడా చేసుకోలేరు
Comments
Post a Comment