హ్యాండ్ వాష్ తోనూ ప్రమాదమే. పొద్దున లేవగానే వాడే టూత్పేస్ట్, స్నానానికి ఇవాడే సబ్బు, కరోనా కారణంగా నిత్యజీవితంలో భాగమైన హ్యండ్వాష్.. ఇవన్నీ ఇప్పుడు మనిషి ఆరోగ్యాన్ని సైలెంట్గా ధ్వంసం చేస్తున్నాయని అంటున్నారు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు. వాటిలో వాడే ట్రైక్లోసన్ అనే రసాయనం మనిషి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని ఐఐటీ హైదరా బాద్ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ అనామిక భార్గవ బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ట్రైక్లోసను 1960లో అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి దీనిని అనేక ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. ఎక్కువగా టూత్పేస్టులు, సబ్బులు, హ్యాండ్వాషాల తయారీలో వాడుతు న్నారు. ఆరోగ్యంపై ట్రైక్లోసన్ ప్రభావాన్ని తెలుసు కొనేందుకు జీబ్రాఫిష్ అనే ఒక రకమైన చేపలు, ఎత్తుగా ఉండే జంతువులపై పరిశోధన నిర్వహిం చారు. ఆ తర్వాత మానవులపై అధ్యయనం చేయగా మెదడు కణాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఇది న్యూరోట్రాన్స్మిష న్లో పాల్గొనే జన్యువులు, ఎంజైమ్లను ప్రభా వితం చేయడమే కాకుండా న్యూరాన్లను కూడా దెబ్బతీస్తుందని గుర్తించారు.
న్యూరాన్ జంక్షన్ల వద్ద న్యూరో ట్రాన్స్మిటర్కు నియంత్రణలా పని చేసే ఎసిటైల్ కోలినెస్టరేస్ అనే ఎంజైమ్ను బల హీనం చేస్తున్నట్టు తేలింది. ట్రైక్లోసన్ ప్రభావం ఎలా తగ్గించవచ్చన్న దానిపైనా అనామిక భార్గవ బృందం పరిశోధనలు చేసింది. మెలటోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ను వాడటంతో ట్రైక్లోసన్ ప్రభావాన్ని నివారించవచ్చని గుర్తించారు.
ట్రైక్లో సన్ను ప్రభావాన్ని నివారించే యాంటి ఆక్సి డెంట్లు ఆకుకూరలు, పండ్లు, నట్స్లో ఉంటా యని అనామిక భార్గవ తెలిపారు. ట్రైక్లోసన్ ఆధా రిత ఉత్పత్తుల వాడకంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లా డుతూ 21వ శతాబ్దంలో ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్ నిరంతరం పరిశోధనలు జరుపుతున్నదని తెలి పారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ (ఎల్డీఏ) ఇప్పటికే ట్రైక్లోసన్ వాడకంపై పాక్షిక నిషేధం విధించించినట్టు చెప్పారు. Source: Namasthe Telangana
Comments
Post a Comment